Meenakshi Lekhi news(Parliament monsoon session updates) : కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి విపక్ష ఎంపీలకు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. పార్లమెంట్లో తను ప్రసంగిస్తుండగా ఆందోళన చేసిన విపక్షాలపై ఫైర్ అయ్యారు. సైలెంట్గా ఉండండి.. లేదంటే మీ ఇంటికి ఈడీ వస్తుందంటూ హెచ్చరించారు. దీంతో ఇప్పుడీ వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
నిన్న లోక్సభలో ఢిల్లీ సర్వీసుల బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో.. విపక్ష సభ్యులు మినాక్షి లేఖి ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఒక నిమిషం మీరు నా మాటలు వినాలని.. సైలెంట్గా ఉండాలని.. లేదంటే ఈడీ మీ ఇంటికి వస్తుందని మంత్రి మీనాక్షి వార్నింగ్ ఇచ్చారు. మళ్లీ వెంటనే జోక్ చేస్తున్నానంటూ తన వ్యాఖ్యలను కవర్ చేసే ప్రయత్నం చేశారు మీనాక్షి లేఖి.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీ ఇంటికి వస్తుందని మంత్రి మీనాక్షి వార్నింగ్ ఇవ్వడంపై విపక్ష నేతలు ఫైర్ అయ్యారు. బీజేపీ మంత్రులు పార్లమెంట్లోనే దమ్కీలు ఇస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తుందన్న తాము ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తున్నామని.. ఇప్పుడు మీనాక్షి వ్యాఖ్యలతో తమ ఆరోపణలు నిజమయ్యాయని చెబుతున్నారు. ఇక సోషల్ మీడియాలో మంత్రి మీనాక్షి లేఖి వీడియో వైరల్ అవుతోంది.