Massive Fire Breaks out In A Power Distribution Company In Raipur’s Kota Area: ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. రాయ్ పూర్ లోని కోటా ప్రాంతలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల కంపెనీలో శుక్రవారం మధ్యాహ్న సమయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇంకా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సబ్ స్టేషన్లో ఉన్న ట్రాన్స్ ఫార్మర్లు కాలి పోతున్నాయి. ఈ నేపథ్యంలో భారీగా మంటలు ఎగిసి పడటంతో ఆ చుట్టు ప్రక్కల ప్రదేశం అంతా నల్లటి పొగతో కమ్మేసింది.
Also Read: కేవలం రూ.425తోనే గోవా టూర్.. ఎలాగంటే..
చుట్టు ప్రక్కల ఉన్నవారు పోలీసులకు సమాచారాన్ని అందించడంతో హూటా హూటినా సంఘటన స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంధి మంటలను అదుపు చేసేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం విద్యుత్ సబ్ స్టేషన్లో ఉన్న ట్రాన్స్ ఫార్మర్లు కాలి పోతున్నాయి.
దీంతో అప్రమత్తమైన అధికారులు పరిసర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు చేపడుతున్నారు. ఇదిలా ఉంటే సబ్ స్టేషన్ చుట్టు ప్రక్కల ఉన్న ఇళ్ళలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
#WATCH | Massive fire breaks out in a power distribution company in Raipur's Kota area; police and firefighters present on the spot #Chhattisgarh pic.twitter.com/Sr86gmFmEL
— ANI (@ANI) April 5, 2024