Pune Drugs : మహారాష్ట్రలోని పూణెలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. సుమారు 51 కోట్ల రూపాయల విలువైన 101 కిలోలకు పైగా డ్రగ్స్ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ స్వాధీనం చేసుకుంది. ఈ వ్యవహారంతో సంబంధమున్న తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలకు చెందిన ఐదుగురు వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్-పుణే జాతీయ రహదారిపై తనిఖీలు చేస్తున్న DRI అధికారులకు.. ఈ నెల 22న తెలంగాణ రిజిస్ట్రేషన్ ప్లేట్ ఉన్న కారులో భారీగా డ్రగ్స్ దొరికాయి. 101 కిలోల మెథాక్వలోన్ తో పాటూ.. కారును కూడా అధికారుల బృందం స్వాధీనం చేసుకుంది. పట్టుబడ్డ నిందితులను విచారిస్తున్న అధికారులు.. డ్రగ్స్ దందా మూలాలు తెలంగాణలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ డ్రగ్స్ ను నిందితుల ముఠా.. వివిధ రాష్ట్రాల్లో విక్రయిస్తున్నట్లు DRI అధికారులు ప్రకటించారు.