EPAPER

Gujarat: లవర్స్ సూసైడ్.. ఏడాది తర్వాత పెళ్లి చేసిన పెద్దలు

Gujarat: లవర్స్ సూసైడ్.. ఏడాది తర్వాత పెళ్లి చేసిన పెద్దలు

Gujarat: పిల్లలు ప్రేమించుకోవడం.. పెద్దలు నిరాకరించడం అనేది కామన్‌ అయిపోయింది. ఇటువంటి సంఘటనలు ఎన్నో చూశాం. తల్లిదండ్రులను ఒప్పించలేక కొందరు ప్రేమికులు విడిపోతుంటే.. మరికొందరు తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఇటువంటి ఘటనలు ఎక్కువైపోయాయి.


గుజరాత్‌లోని తాపీ జిల్లాలో పోయిన ఏడాది ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. కటుంబ సభ్యులు వారి ప్రేమను అంగీకరించకపోవడే ఇందుకు కారణం. నెవాలా గ్రామానికి చెందిన గణేష్, రంజన కొంతగా కాలంగా ప్రేమించుకుంటున్నారు. పోయిన ఏడాది వాళ్ల ప్రేమ వ్యవహారం ఇరువురి ఇంట్లో తెలియడంతో గొడవలు జరిగాయి. ఒప్పించేందుకు వాళ్లు ఎంత ప్రయత్నించినా పెద్దలు వారి ప్రేమను అంగీకరించలేదు.

దీంతో మనస్తానికి గురైన గణేష్, రంజన గ్రామ సమీపంలోని ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వారి మరణంతో ఇరు కుటుంబాల్లో మార్పు వచ్చింది. దీంతో వాళ్ల చివరి కోరిక తీర్చాలని ఇరుకుటుంబాల వారు నిర్ణయించుకున్నారు. ఏడాది తర్వాత గణేష్, రంజన విగ్రహాలను ఏర్పాటు చేసి వివాహం జరిపించారు. జనవరి 14న గ్రామపెద్దలు, బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. అయితే బతికి ఉన్నప్పుడే వాళ్ల ప్రేమను అంగీకరిస్తే రెండు ప్రాణాలు నిలిచేవని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Related News

Star Health Data: స్టార్ హెల్త్ కస్టమర్లకు షాక్.. డేటా మొత్తం ఆ యాప్ లో అమ్మకానికి ?

Jammu Kashmir Elections: జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

MLA Bojju Patel: రవ్‌నీత్ సింగ్ తలను తీసుకొస్తే.. నా ఆస్తి రాసిస్తా : కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలనం

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Big Stories

×