Marriage Fraud Women who married 50 men Arrested for Cheating: పెళ్లంటే నూరేళ్లు బంధమన్నారు మన పెద్దోళ్లు. మూడుముళ్లు ద్వారా ఒక్కటై. జీవితాంతం ఒకరికొకరి కలిసి బ్రతకడానికి ఏర్పరచుకున్నదే వివాహం బంధం. మరి అలాంటి పవిత్రమైన వివాహ బంధాన్ని పూర్తిగా విఛ్చనం చేసింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన సంధ్య అనే ఓ వివాహిత.. ఏకంగా 50 మందిని పెళ్లి చేసుకుని నిత్య పెళ్లి కూతురుగా మారింది ఈ కిలాడీ లేడి.
తమిళనాడుకు చెందిన ఈ కంత్రీ వివాహిత సంధ్య వలలో చిక్కుకుని చాలా మందే ఉన్నారు. పోలీసు అధికారులనే బోల్తా కొట్టించిందంటే ఈ కిలాడీ లేడీ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. బాధితుల్లో ఏకంగా డీఎస్పీ, ఇద్దరు పోలీసు అధికారులు కూడా మోసం చేసింది ఈ మాయలేడి. వీరితో సహ 50 మందిని పెళ్లి చేసుకుంది. కేవలం నగలు, డబ్బులే లక్ష్యంగా ఈ బాగోతాన్ని నడిపించుకుంటూ వచ్చింది. అయితే ఓ యువకుడి ఫిర్యాదు ఆమె బండారం బయటపడింది. తమిళనాడుకి చెందిన ఓ యువకుడికి 35 సంవత్సరాలు వచ్చినా ఇంకా మ్యారేజ్ కాకపోవడంతో.. డేట్ ద తమిళ్ వే అనే వెబ్సైట్లో చూసి సంధ్య అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు.
Also Read: సూరత్లో కుప్పకూలిన ఆరంతస్తుల భవనం.. ఏడుగురి మృతి..
మ్యారేజ్ అయిన 3 నెలల తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు రావడంతో అతనికి అనుమానం వచ్చి..ఆమె ఆధార్ కార్డు చెక్ చేయగా అందులో భర్త పేరు వేరే ఉంది. దీనిపై సంధ్యను ప్రశ్నించడంతో చంపేస్తానని బెదిరించింది. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. యువకుడి ఫిర్యాదుతో పోలసులు సంధ్యను అదుపులో తీసుకొని విచారించగా.. అసలు విషయం బయటపడింది. అప్పటికే సంధ్య ఒక డీఎస్పీ, ఒక పోలీసు ఇన్స్పెక్టర్, మదురైలో మరో పోలీసు అధికారి, కరూర్లో ఒక ఫైనాన్స్ అధికారితో సహా 50 మందికి పైగా పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. దీంతో సంధ్య అసల స్వరూపం బయటపడింది.