EPAPER

Nagpur News: నాగ్‌పూర్‌లో డీజే సౌండ్ బాంబ్.. పలువురికి గాయాలు

Nagpur News: నాగ్‌పూర్‌లో డీజే సౌండ్ బాంబ్.. పలువురికి గాయాలు

Nagpur News: ఇటీవల చిన్న పార్టీ నుంచి మొదలుకుని పెళ్లిళ్ల వరకు డీజే లేకుండా అస్సలు జరగడం లేదు. ఏ ఫంక్షన్ అయినా సరే బ్యాండ్ బాజాలు మోగాల్సిందే. పాట లేనిదే ఏ ఫంక్షన్ కూడా జరగడం లేదు. అంతేకాదు డీజే ఉంటే తప్పా అసలు ఫంక్షన్ కే రావడం కుదరదని చెప్పే బంధువులు కూడా ఉంటున్నారు. చిన్న పిల్లల నుంచి మొదలుకుని ముసలి వారి వరకు చిందులేసేందుకు సై అంటున్నారు. అయితే ఇలాంటి క్రమంలోనే డీజే వల్ల చాలా సార్లు ప్రమాదాలు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి.


డీజే కారణంగా చాలా గొడవలు జరుగుతుంటాయి. అయితే ఇలాంటి ఘటనలు చాలా సహజమే కానీ డీజే కారణంగా ప్రమాదాలు జరిగిన ఘటన తాజాగా వెలుగుచూసింది. డీజే నుంచి వైబ్రేషన్స్ కారణంగా ఒక గోడ కూలి పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని నాగ్ పూర్ లో వెలుగుచూసింది.

ఓ ఇంటి వద్ద డీజేను ప్లే చేశారు. ఈ తరుణంలో ఆ ఇంటికి ఆనుకుని ఉండే ఒక్కసారిగా డీజే నుంచి వచ్చిన వైబ్రేషన్స్ కారణంగా కూలిపోయింది. దీంతో అక్కడే ఉన్న పలువురు స్థానికులు తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో వారికి తీవ్ర రక్త స్రావం కూడా జరిగింది. దీంతో చికిత్స నిమిత్తం వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కూడా కేసు నమోదు చేసినట్లు సమాచారం. అయితే డీజే కారణంగా జరిగిన ఈ ప్రమాదానికి స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే డీజేను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. డీజే కారణంగా ఇలాంటి ప్రమాదాలు జరగడం బాధాకరమని అంటున్నారు.


 

Related News

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Jammu Kashmir: ఓటెత్తిన కశ్మీరం.. 58.19 శాతం పోలింగ్ నమోదు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Big Stories

×