Manipur : మణిపూర్ నోనీ జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 15 మంది విద్యార్ధినులు మృతి చెందారు. 20 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. మణిపూర్ రాష్ట్రం.. నోని జిల్లాలో థంబాల్నూ స్కూల్ విద్యార్ధులు స్టడీ టూర్కి బయలుదేరారు.
విద్యార్ధులు, విద్యార్ధినులు వేరు వేరు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. బస్సు లాంగ్సాయ్ వద్దకు వెళ్లగానే అక్కడ ములుపు తీసుకునే క్రమంలో డ్రైవర్ కంట్రోల్ తప్పాడు. డ్రైవర్ తప్పిదం వల్ల బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. వెంటనే స్థానికులు వచ్చి చూడగా..అనేక మందికి తీవ్రగాయాలయ్యాయి.
15 మందికి పైగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందం దుర్ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి సహాయకచర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం పై మణిపూర్ రాష్ట్ర సీఎం ఎన్. బీరేన్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.