Manipur Violence: మణిపుర్ మళ్లీ అట్టుడికిపోతోంది. తీవ్ర హింస చెలరేగింది. ఉగ్రవాదులు, గ్రామ వాలంటీర్ల మధ్య కాల్పులు జరిగాయి. కాల్పుల్లో 9 మంది చనిపోయారు. ఒకరు పరిస్థితి సీరియస్గా ఉంది.
ఇంఫాల్ తూర్పు జిల్లాలోని ఖమెన్లక్ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల ఘటనలో సుమారు తొమ్మిది మంది గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రుల్లో చేర్చారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, మిగిలిన వారికి ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యాధికారులు తెలిపారు.
ఉగ్రవాదులకు చెందిన తాత్కాలిక బంకర్లు, వారు నిర్మించుకున్న నిఘా టవర్ను గ్రామ వాలంటీర్లు దహనం చేశారని పోలీసులు తెలిపారు.
బిష్ణుపుర్ జిల్లాలోని గోవింద్పుర్ గ్రామంలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ఓ ఉగ్రవాది మృతి చెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు.
మణిపుర్లో గత కొన్ని రోజులుగా మైతీ-కుకీ తెగల మధ్య చెలరేగిన హింసాత్మక ఘటనల్లో కనీసం 100 మంది పౌరులు మృతి చెందగా 310 మంది గాయపడ్డారు.
హింసాత్మక ఘటనలతో కర్ఫ్యూ సమయం మరింత పెంచారు. ఆంక్షలను కఠినతరం చేశారు. మణిపూర్.. ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందోననే హైటెన్షన్ నెలకొంది.