Mangalore Blast Terrorist Shariq : మంగళూరు ఆటోబ్లాస్ట్ ఉగ్రవాద చర్యగా తేల్చారు కర్నాటక పోలీస్ దర్యాప్తు సంస్థలు. ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు మొహమ్మద్ షరీఖ్ ప్రధాన నిందితుడిగా గుర్తించారు. గతంలో షరీక్ పై పలు కేసులు నమోదయినట్లు పోలీసులు కనుగ్గొన్నారు. వీటిలో రెండు కేసులు మంగళూరులో నమోదుకాగా ఒకటి శివమొగ్గలో రిజిస్టర్ అయింది. ఈకేసుకు సంబంధించి కర్నాటక పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.
కుక్కర్ ఐఈడీ బ్లాస్ట్కు 500 గ్రాములు గన్పౌడర్ను ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. అంతగా అనుభవం లేనివారే ఈ బాంబాలను తయారు చేశారని పోలీసులు నిర్ధారించారు. చుట్టు పక్కల ఈజీగా లభ్యమైన వస్తువులను ఉపయోగించే ఈ బాంబ్ను తయారు చేసినట్లు వెళ్లడించారు పోలీసులు. బాంబు తయారీలో జరిగిన తప్పిదాలవల్లే ఒక్కసారిగా బాంబ్ బ్లాస్ట్ అయిందని తేల్చారు.
మైసూరులో షరీఖ్ నివసించిన రెంట్ హౌస్లో తనిఖీలు చేపట్టారు పోలీసులు. షరీఖ్ ఇంటి నుంచి బాంబ్ మెటీరియల్స్, నట్స్, బోల్డ్స్, అమొనియం నైట్రేట్, ఇతర పేలుడు పదార్ధాలను సేకరించారు. అయితే షరీఖ్ ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మామూలు స్థితికి వస్తే మరిన్ని విషయాలు రాబట్టవచ్చని పోలీసులు చెబుతున్నారు.