Mahua Moitra : లోక్సభలో ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకున్నారంటూ తృణముల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రాపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా ఆమె మాజీ మిత్రుడు జై అనంత్ దెహద్రాయ్కు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ సమన్లు ఇచ్చింది. గురువారం(జనవరి 25) ఆయన్ను సీబీఐ ప్రశ్నించనుంది.
లోక్సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి మొయిత్రా డబ్బులు, ఖరీదైన కానుకలు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. మొయిత్రా పార్లమెంట్ లాగిన్ వివరాలను దుబాయ్ నుంచి యాక్సెస్ చేశారని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఎథిక్స్ కమిటీ.. మహువా మొయిత్రాతో పాటు ఆమెపై ఫిర్యాదు చేసిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే, న్యాయవాది దెహద్రాయ్ను కమిటీ విచారించింది. నిబంధనలకు విరుద్ధంగా తన పార్లమెంట్ లాగిన్ వివరాలను బయటి వ్యక్తులకు ఇచ్చినట్లు కమిటీ నిర్ధారించింది. ఈ క్రమంలోనే ఆమెను లోక్సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు స్పీకర్ గతంలో ప్రకటించారు.
పశ్చిమ్ బెంగాల్కు చెందిన కొందరు పోలీసు అధికారులతో ఉన్న పరిచయాలతో మహువా తనపై అక్రమంగా నిఘా ఉంచారని డిసెంబర్లో దెహద్రాయ్ సీబీఐకి లేఖ రాశారు. తన ఫోన్ నెంబర్తో, తాను ఎక్కడున్నాననే విషయాన్ని ట్రాక్ చేసే అవకాశం ఉందని ఆ లేఖలో ఆయన ఆరోపించారు.