Maharashtra Bridge Collapse : మహారాష్ట్ర బల్లార్షా రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూలిపోయింది. బ్రిడ్జి స్లాబ్ కూలడంతో పట్టాలపై ప్రయాణికులు పడిపోయారు. ప్రమాదంలో… పలువురు ప్రయాణికులకు గాయాలు కాగా… వారిని స్థానిక సివిల్ హాస్పిటల్కు తరలించారు.
రైల్వే స్టేషన్లో ఒక ప్లాట్ఫాం నుంచి వేరే ప్లాట్ఫాంకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ఈ వంతెనపై నడుస్తుండగా అనేకమంది ప్రయాణికులు దాదాపు 60అడుగుల ఎత్తునుంచి కిందకు జారిపడ్డారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 8మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.రైల్వేస్టేషన్ లోని ఒకటో నెంబర్ ప్లాట్ ఫాం నుంచి 4 నెంబర్ ఫ్లాట్ ఫాం వరకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది