Madhya Pradesh Lok Sabha Election Results:లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి దూసుకెళ్తోంది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. 290కు పైగా స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఇక, కాంగ్రెస్ కూటమి 232 స్థానాలతో పోరాడుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసుందుకు కావాల్సిన స్థానాలు 272. ఇప్పటికే గుజరాత్లోని గాంధీనగర్లో అమిత్ షా విజయం సాధించారు. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సోనాల్ రమణ్భాయ్పై 5లక్షల 40వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
రికార్డు బద్దలు..
మధ్యప్రదేశ్లోని ఇండోర్ లోక్సభ స్థానంలో బీజేపీ నుంచి పోటీ చేసిన శంకర్ లల్వానీ ఘన విజయం సాధించారు. లోక్సభ ఎన్నికల్లో ఆల్ టైమ్ రికార్డు దిశగా దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్లో శంకర్ లల్వానీ.. 10 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అంతకుముందు లోక్ సభ చరిత్రలో ప్రీతమ్ ముండే పేరిట అత్యధిక మెజార్టీ ఉన్న 6.9లక్షల ఓట్ల మెజార్టీ రికార్డును శంకర్ లల్వానీ అధిగమించాడు. కాగా, ఈ లోక్ సభ స్థానం నుంచి చివరి నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే.