Madhya Pradesh Exit polls | మధ్యప్రదేశ్లో నవంబర్ 17న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో మొత్తం 230 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏ పార్టి అయినా మేజిక్ ఫిగర్ 116 సాధించాలి. ప్రస్తుతం బిజేపీ ప్రభుత్వమున్న మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు.
మధ్యప్రదేశ్లో నవంబర్ 17న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో మొత్తం 230 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏ పార్టి అయినా మేజిక్ ఫిగర్ 116 సాధించాలి. ప్రస్తుతం బిజేపీ ప్రభుత్వమున్న మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు.
ఇక ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే..
పిపుల్ పల్స్ సర్వే
కాంగ్రెస్ 117 – 139
బిజేపీ 91 – 113
ఇతరులు 0 – 8
జన్ కీ బాత్ సర్వే
కాంగ్రెస్ 102 – 125
బిజేపీ 100 – 123
ఇతరులు 0 – 5
పోల్ స్ట్రాట్ సర్వే
కాంగ్రెస్ 111 – 121
బిజేపీ 106 – 116
ఇతరులు 0 – 6
రిపబ్టిక్ మాట్రైజ్ సర్వే
కాంగ్రెస్ 97 – 107
బిజేపీ 118 – 130
ఇతరులు 0 – 2
ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను పరిశీలిస్తే ఒకటి బిజేపీ, రెండు కాంగ్రెస్కి స్పష్టమైన ఆధిక్యం కట్టబెట్టాయి. కానీ జన్ కీ బాత్ సర్వే ప్రకారం రెండు పార్టీల మధ్య గట్టిపోటీ ఉంది. ఈ నేపథ్యంలో గత 2018 ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే కమల్ నాథ్ నాయకత్వంలో కాంగ్రెస్ గెలిచినా.. కొంత కాలమే అధికారంలో ఉంది. ఆ తరువాత ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు, కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిజేపీ చెంతకు చేరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేశారు. శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో బిజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.