Lok Sabha Elections 2024: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన సరే ఎన్నికల హడావుడినే కనిపిస్తుంది. ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా సరే.. ఎన్నికలు, పోటీ చేసే అభ్యర్థుల గురించే చర్చ జరగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమెక్రటిక్ రిఫామ్స్ ఓ నివేదికను విడుదుల చేసింది. ఈ విశ్లేషణ ప్రకారం.. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో సగం మంది నేర చరితులు ఉన్నవారేనని వారు దాఖలు చేసిన అఫిడివిట్ ఆధారంగా వెల్లడించింది.
ఈ లోక్ సభ ఎన్నికల తొలి దశలో దాదాపు సగం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులపై నేర పూరితమైన కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమెక్రటిక్ రిఫామ్స్ విశ్లేషించింది. మొత్తం 102 స్థానాలకు గాను 42 సీట్లలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది నేర చరితులైన అభ్యర్థులే ప్రధాన పార్టీల తరఫున ఎన్నికల బరిలో నిలిచారని తెలిపింది.
మొత్తం దేశవ్యాప్తంగా దాఖలైన 1618 మంది ఎన్నికల అఫిడవిట్లను ఏడీఆర్ పరిశీలించింది. అందులో 252 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని పేర్కొంది. వారిలో 161 మందిపై తీవ్రమైన నేరాభియోగాలున్నాయని వెల్లడించింది. 35 మంది పోటీ దారులపై విద్వేష ప్రసంగాల కేసులున్నాయని స్పష్టం చేసింది.
Also Read: ఎన్నికల ముందు బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరనున్న కేంద్ర మాజీ మంత్రి..!
ప్రస్తుతం జరగబోయే తొలి విడత ఎన్నికల్లో 41 శాతం సీట్లలో రెడ్ అలర్ట్ ప్రకటించాలని ఏడీఆర్ సూచించింది. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసే వారిలో 28 శాతం మంది అభ్యర్థులు కోటీశ్వరులేనని ప్రటకటించింది. ఆర్జేడీ, డీఎంకే, ఎస్పీ, టీఎంసీ అభ్యర్థుల్లో 40 శాతం మంది ఏదో ఒక నేరానికి పాల్పడిన వారేనని తన విశ్లేషణలో వెల్లడించింది.