3rd Phase election Schedule Released by Election Commission: మూడో విడత ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. కాగా దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ను రేపు విడుదల చేయనుంది. 2024 సార్వత్రిక ఎన్నికల మూడో దశ నామినేషన్ల ప్రక్రియ రేపటి(ఏప్రిల్ 12) నుంచి ప్రారంభంకానుంది.
మూడో దశలో 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 94 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. అస్సాం, బీహార్, ఛత్తీస్ఘడ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ & డయ్యు, గోవా, గుజరాత్, జమ్మూ &కాశ్మీర్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో మూడో దశలో ఎన్నికలు జరగనున్నాయి.
మధ్యప్రదేశ్లోని బేతుల్ నియోజకవర్గానికి రెండో దశలో ఎన్నికలు జరగాల్సి ఉండగా బేతుల్ బీఎస్పీ ఎంపీ అభ్యర్థి మరణించడంతో ఆ స్థానానికి మూడో దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
Also Read: Kashi Vishwanath Temple: వివాదంలో యోగి సర్కార్.. అర్చుకుల వేషధారణలో పోలీసులు
ఇక నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం(ఏప్రిల్ 12) నుంచి ప్రారంభంకానుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 19 చివరి తేది. ఏప్రిల్ 20న నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఇక నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 22.
మూడో దశలో పోలింగ్ మే 7వ తేదీన జరగనుండగా.. కౌంటింగ్ జూన్ 4వ తేదీన జరుగుతుంది.