Lok Sabha Elections Phase 7: లోక్ సభ ఎన్నికల తుది దశ పోలింగ్ ముగిసింది. మొత్తం ఏడు విడతల్లో జరిగిన ఎన్నికలు.. శనివారం జరిగిన ఏడో దశ పోలింగ్తో ముగిశాయి. దీంతో అందరి చూపు జూన్ 4న జరగనున్న కౌంటింగ్వైపు పడింది. ఏడో దశలో భాగంగా ఏడు రాష్ట్రాల్లోని 57 అసెంబ్లీ స్థానాలకు, ఒడిషాలోని 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది.
చండీగఢ్తో పాటు పంజాబ్లోని మొత్తం 13 స్థానాలు, హిమాచల్ ప్రదేశ్లోని నాలుగు స్థానాలు, ఉత్తరప్రదేశ్లోని 13 స్థానాలు, పశ్చిమ బెంగాల్లో 9, బీహార్లో 8, ఒడిశాలో 6, జార్ఖండ్లో మూడు స్థానాలకు శనివారం పోలింగ్ ముగిసింది. ఒడిశాలోని 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు, హిమాచల్ ప్రదేశ్లోని ఆరు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు ఒకేసారి జరిగాయి.
ఈ సాయంత్రం 5 గంటలకు, ఏడు రాష్ట్రాలు, చండీగఢ్లో 58.3% ఓటింగ్ నమోదైంది. బీహార్లో అత్యల్పంగా 35% కంటే ఎక్కువ ఓటింగ్ నమోదు కాగా, హిమాచల్ ప్రదేశ్లో అత్యధికంగా 48.6% నమోదైంది.