EPAPER

LK Advani : అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం.. ఆ ఇద్దరు నేతలకు ఎట్టకేలకు ఆహ్వానం..

LK Advani :  అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం..  ఆ ఇద్దరు నేతలకు ఎట్టకేలకు ఆహ్వానం..
lk advani
lk advani

LK Advani: అయోధ్య రామమందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి 22న జరగనుంది. రామ మందిరం ఉద్యమంలో కీలక పాత్ర వహించిన ఎల్ కే ఆడ్వానీ(96), మురళీ మనోహర్ జోషి(89) ఇద్దరు నేతలను విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యనిర్వహక అధ్యక్షుడు అలోక్ కుమార్ స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. వచ్చేందుకు ప్రయత్నిస్తామని ఆ ఇద్దరు నేతలు చెప్పినట్లు సమాచారం.


అంతకుముందు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఈ వేడుకలకు ఇద్దరు సీనియర్ నాయకులు రాకపోవడం మంచిదని రామ మందిర ట్రస్ట్ సభ్యులు సోమవారం విన్నవించారు. ”మా వినతిని వారిద్దరూ స్వీకరించారు.. ఆలయ వేడుకలకు హాజరుకావడం లేదు” అని ట్రస్టు ప్రధాన కార్యదర్మి చంపత్ రాయ్ విలేకరులకు వెల్లడించారు. ఆయన ప్రకటనపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆడ్వానీ, మురళీ మనోహర్ జోషిని ఆహ్వానించారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు జనవరి 22న జరిగే ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ ప్రధానమంత్రి దేవగౌడను ఆహ్వానించేందుకు ముగ్గురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేశామని ట్రస్టు సభ్యులు తెలిపారు. జనవరి 23 నుంచి అయోధ్య రామమందిరంలోకి సాధారణ భక్తులను అనుమితిస్తారు.


Related News

RahulGandhi reacts: తిరుమల లడ్డూ వివాదం.. రాహుల్‌గాంధీ రియాక్ట్, నెయ్యిపై సీఎం సిద్దరామయ్య..

Himanta Biswa Sarma: దీదీజీ.. పైలే బెంగాల్ వరదలు దేఖో.. ఉస్కే‌బాద్ ఝార్ఖండ్ గురించి బాత్‌కరో : సీఎం

Odisha Army Officer: ‘ఫిర్యాదు చేయడానికి వెళ్తే నా బట్టలు విప్పి కొట్టారు.. ఆ పోలీస్ తన ప్యాంటు విప్పి అసభ్యంగా’.. మహిళ ఫిర్యాదు

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టులో జర్నలిస్ట్ పిటిషన్

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డు వ్యవహారం.. జగన్‌పై కేంద్ర మంత్రుల సంచలన వ్యాఖ్యలు

Star Health Data: స్టార్ హెల్త్ కస్టమర్లకు షాక్.. డేటా మొత్తం ఆ యాప్ లో అమ్మకానికి ?

Jammu Kashmir Elections: జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

Big Stories

×