Liberian ship Hijack : హిందూ మహా సముద్రంలో భారత నౌక హైజాక్కు గురైంది. ఈ ఘటన సోమాలియా తీరంలో చోటుచేసుకుంది. లైబీరియా జెండాతో ఉన్న నౌకలో దాదాపు 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. భారత నౌకాదళం ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే స్పందించింది. హైజాకింగ్ గురించి UKMTO ఏజెన్సీకి నౌక సందేశం పంపింది. గురువారం సాయంత్రం గుర్తుతెలియని సాయుధులు నౌకలోకి అక్రమంగా ప్రవేశించారని తెలిపింది.
భారత నౌకాదళం వెంటనే స్పందించింది. MV LILA NORFOLK నౌక గమనాన్ని పరిశీలిస్తోంది. ఐఎన్ఎస్ చెన్నైను సముద్రతీర గస్తీ కోసం రంగంలోకి దించింది. ఎయిర్ క్రాఫ్ట్ ను కూడా పంపింది. నౌకలోని సిబ్బందితో కమ్యునికేషన్ ఏర్పడిందని అధికారులు తెలిపారు. హైజాక్ కు గురైన భారతీయులు సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు.
హిందూ మహ మహాసముద్రంలో ఈ ఘటనలు ఇంతకు ముందు కూడా జరిగాయి. కొద్ది రోజుల క్రితం గుజరాత్ తీరంలో భారత్ కు వస్తున్న ఓ వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిగింది. సమాచారం అందుకున్న భారత నేవీ వెంటనే ‘ఐసీజీఎస్ విక్రమ్’ను రంగంలోకి దించి సహాయక చర్యలు చేపట్టింది. ఆ ప్రమాదం నుంచి నౌకలోని 20 మంది భారతీయులను భారత నేవీ సురక్షితంగా కాపాడిందని భారత నౌకాదళం వెల్లడించింది