KTR Satire on BJP Leaders Kangana and Annamalai: దేశంలో అసలే ఎన్నికల వేడి నడుస్తోంది. ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీలపై నేతలు విమర్శలు చేస్తారు. ఈ క్రమంలో నేతలు టంగ్ స్లిప్ అవుతారు… అయినవాళ్లూ లేక పోలేదు. సోషల్ మీడియా బలంగా ఉన్న ఈ రోజుల్లో ఆయా నేతలు జాగ్రత్తగా మాట్లాడాలి. లేకుంటే నెటిజన్స్కు అడ్డంగా దొరికిపోయినట్టే. తాజాగా ఇద్దరు బీజేపీ ఎంపీ అభ్యర్థుల విషయంలోనూ అదే జరిగింది. ఒకరు బాలీవుడ్ హీరోయిన్ కంగనారనౌత్ కాగా మరొకరు అన్నామలై.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బీజేపీ అభ్యర్థి కంగనా.. నేతాజీ తొలి ప్రధాని అని ప్రస్తావించారు. తమిళనాడుకి చెందిన బీజేపీ అభ్యర్థి అన్నామలై అయితే మహాత్మాగాంధీ మన ప్రధాని అని చెప్పుకొచ్చారు. ఈ నేతలను సోషల్ మీడియాలో నెట్ యూజర్స్ వెంటాడుతున్నారు.
ఆయా నేతల మాటలపై బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా చురకలు అంటించా రు. ఉత్తరాదికి చెందిన ఓ నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ తొలి ప్రధాని అని నోరుజారారు. దక్షిణాదికి చెందిన మరో నేత మహాత్మాగాంధీ మన ప్రధాని అంటారు. వీళ్లు అసలు ఎక్కడ గ్రాడ్యుయేట్ అయ్యారంటూ ట్వీట్ చేశారు. దీనిపై చర్చించుకోవడం నెటిజన్స్ వంతైంది.
Also Read: Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు మరో షాక్.. సీబీఐ విచారణకు రంగం సిద్ధం..
Whatsapp University students😁👇
Subhash Chandra Bose was the first Prime Minister of India – BJP candidate Kangana Ranaut.
Mahatma Gandhi was out Prime Minister – BJP candidate K. Annamalai pic.twitter.com/WmuT0sqcez
— Enugu Bharath Reddy (@BharathReddyBRS) April 5, 2024