Simultaneous Polls : జమిలి ఎన్నికల నిర్వహణపై మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలోని కమిటీ ప్రజల నుంచి సలహాలు స్వీకరిస్తోంది. ఇప్పటివరకు 5వేలకు పైగా సూచనలు అందాయి. ఒకే దేశం – ఒకే ఎన్నికపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్రం కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఈ కమిటీ చర్యలు ప్రారంభించింది.
Simultaneous Polls : జమిలి ఎన్నికల నిర్వహణపై మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలోని కమిటీ ప్రజల నుంచి సలహాలు స్వీకరిస్తోంది. ఇప్పటివరకు 5వేలకు పైగా సూచనలు అందాయి. ఒకే దేశం – ఒకే ఎన్నికపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్రం కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఈ కమిటీ చర్యలు ప్రారంభించింది.
ఈ క్రమంలోనే ప్రజల నుంచి సలహాలు, సూచనలను కమిటీ ఆహ్వానించింది. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వేలాది మంది ప్రజలు తమ సూచనలను పంపిస్తున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు 5వేలకు పైగా ఈ-మెయిళ్లు వచ్చినట్లు పేర్కొన్నాయి.
దేశంలో జమిలి ఎన్నికలను నిర్వహించేలా.. ప్రస్తుతం ఉన్న చట్టపరమైన అడ్మినిస్ట్రేటివ్ ఫ్రేమ్వర్క్లో తగిన మార్పులను సూచించాలని కోవింద్ కమిటీ ఇటీవల ఓ ప్రకటనలో కోరింది. జనవరి 15లోగా ప్రజలు తమ సలహాలు, సూచనలు పంపవచ్చని వెల్లడించింది. ఈ సూచనలను కమిటీ వెబ్సైట్ onoe.gov.inలో పోస్ట్ చేయాలని లేదా [email protected] ఐడీకి ఈ-మెయిల్ చేయాలని తెలియజేసింది.
ఒకే దేశం- ఒకే ఎన్నిక కోసం 2023 సెప్టెంబర్ లో ఈ కమిటీ ఏర్పాటైంది. అప్పటి నుంచి రెండుసార్లు సమావేశాలను నిర్వహించింది. ఇటీవల కమిటీ ఆరు జాతీయ పార్టీలు, 33 ప్రాంతీయ పార్టీల నుంచి అభిప్రాయాలు కోరింది. జమిలి ఎన్నికల నిర్వహణపై న్యాయ కమిషన్ నుంచి కూడా సలహాలు తీసుకుంది.