EPAPER

Kiran kumar Reddy : బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి.. మోదీ, అమిత్ షా డైరెక్షన్ బాగుందని ప్రశంసలు..

Kiran kumar Reddy : బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి.. మోదీ, అమిత్ షా డైరెక్షన్ బాగుందని ప్రశంసలు..

Kiran kumar Reddy : ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఆయనకు జాతీయస్థాయిలో కీలక పదవి ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
మార్చి 12న కాంగ్రెస్ కు కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు.


బీజేపీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పై కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం తీరును తప్పుపట్టారు. ఆ పార్టీ ఎందుకు పతనమైందో తెలిపారు. కాంగ్రెస్ హైకమాండ్ తప్పుడు నిర్ణయాల వల్ల ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోయిందన్నారు. పార్టీ పెద్దలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం లేదని తెలిపారు. కాంగ్రెస్ హైకమాండ్ కు పవర్ మాత్రమే కావాలని విమర్శించారు.

కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్స్ లేకుండా పోయారని కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. చేసిన తప్పులేంటో కాంగ్రెస్ కు తెలియడం లేదన్నారు. 1952 నుంచి తన కుటుంబం కాంగ్రెస్ లోనే ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ ను వీడతానని తాను ఎప్పుడూ అనుకోలేదని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ , కేంద్ర హోంమంత్రి అమిత్ షా డైరెక్షన్ బాగుందని కిరణ్ కుమార్ రెడ్డి ప్రశంసించారు. అందుకే బీజేపీలో చేరానని తెలిపారు.


Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×