Kharge Letter to Shah : కేంద్ర హోం మంత్రి అమిత్ షా కి.. ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే లేఖ రాశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర నేపధ్యంలో.. అస్సాంలో తీవ్రమైన భద్రతా సమస్యలు నెలకొన్నాయి. ఈ విషయాలను ప్రస్తావిస్తూ ఖర్గే లెటర్ రాసినట్లు తెలుస్తోంది. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ.. రాహుల్ గాంధీ యాత్రకు భద్రతను కల్పించడంలో విఫలమయ్యారని కాంగ్రెస్ ఫైర్ అవుతుంది.
జనవరి 14న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభించగా.. మొదటి రోజు నుంచి ఏదో ఒక విధంగా బీజేపీ నేతలు న్యాయ యాత్రకు అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నారు. జనవరి 18 అస్సాంలో ప్రవేశించిన భారత్ జొడో న్యాయ యాత్ర కు అడ్డంకులు మరింత ఎక్కువయ్యాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. రోజురోజుకూ రాహుల్ గాంధీకి ప్రజలలో వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక బీజేపీ దాడులకు పాల్పడుతోందని కాంగ్రెస్ విమర్శిస్తుంది.