EPAPER

Transgender Couple: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్‌జెండర్ కపుల్స్

Transgender Couple: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్‌జెండర్ కపుల్స్

Transgender Couple: దేశంలోనే మొట్టమొదటిసారి స్త్రీగా మారిన ఓ పురుషుడు పండంటి బిడ్డకు జన్మనిచ్చాడు. కేరళకు చెందిన ట్రాన్స్‌జెండర్స్ జంట జహద్, జియాపావల్‌లు కొద్దిరోజుల క్రితం తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. బుధవారం జియా కేరళలోని కోయిక్కోడ్ మెడికల్ కాలేజీలో పండంటిబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని జహద్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.


అయితే పుట్టిన బిడ్డ ఆడ, మగ అనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచారు. ఇక తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. పుట్టిన బిడ్డకు పాలు ఇచ్చే అవకాశం లేకపోవడంతో మిల్క్ బ్యాంక్ నుంచి బ్రెస్ట్ మిల్క్‌ను పట్టిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఈ జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు.

కేరళకు చెందిన ట్రాన్స్‌జెండర్లు జియా, జహద్ మూడేళ్లుగా కలిసి జీవనం సాగిస్తున్నారు. పురుషుడుగా జన్మించిన జియా లింగమార్పిడి చేయించుకొని స్త్రీగా మారారు. ఈక్రమంలో జియా గర్భం దాల్చారు. దీంతో జహద్ పురుషుడిగా మారే చికిత్సను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Tags

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×