Karnataka : కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన్రెడ్డి సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు చేశారు. ‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ’ పేరును బెంగళూరులోని తన నివాసంలో ప్రకటించారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని వెల్లడించారు. గంగావతి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నట్టు తెలిపారు. బీజేపీకి రాజీనామా చేసినట్టు చెప్పారు. బీజేపీతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ’ పేరుతో తన ఆలోచనలకు తగినట్టు కొత్త పార్టీని ప్రారంభిస్తున్నామని జనార్దన్రెడ్డి అన్నారు. ప్రతీ పల్లెకు, గడప గడపకు వెళ్తానని చెప్పారు. తనకు ప్రజల ఆశీర్వాదం లభిస్తుందని.. కర్నాటకను సంక్షేమ రాజ్యంగా మారుస్తామని చెప్పారు. ఓబుళాపురం మైనింగ్ కేసులో కోర్టు ఆంక్షలను ప్రస్తావిస్తూ.. 12 ఏళ్లు వనవాసం చేశానని అన్నారు.