EPAPER
Kirrak Couples Episode 1

Kamal Hasan : భారత్ జోడో యాత్రలో కమల్ హాసన్‌.. పాల్గొనేది ఎప్పుడంటే..?

Kamal Hasan : భారత్ జోడో యాత్రలో కమల్ హాసన్‌.. పాల్గొనేది ఎప్పుడంటే..?

Kamal Hasan : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో ఉత్సాహంగా సాగుతోంది. భారీ సంఖ్యలో కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు రాహుల్ వెంట నడుస్తున్నారు. పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాదయాత్రలో సందడి చేస్తున్నారు. ఇప్పుడు ఈ యాత్రలో ప్రముఖ సినీనటుడు కమల్‌ హాసన్‌ పాల్గొననున్నారు. డిసెంబర్‌ 24న ఈ యాత్రలో రాహుల్‌ తో కలిసి నడుస్తారు. రాహుల్‌ గాంధీ ఆహ్వానం మేరకు వచ్చే వారంలో కమల్‌ హాసన్‌ ఈ యాత్రలో పాల్గొంటారని మక్కల్‌ నీది మయ్యం పార్టీ వర్గాలు వెల్లడించాయి.


ప్రస్తుతం రాజస్థాన్‌లో కొనసాగుతున్న భారత్‌ జోడో యాత్ర డిసెంబర్‌ 24న దేశ రాజధాని ఢిల్లీలోకి ప్రవేశిస్తుంది. ఎనిమిది రోజుల విరామం తర్వాత బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణాలో కొనసాగించనున్నారు. చివరగా జమ్మూకశ్మీర్‌లోకి ప్రవేశించడానికి ముందు వచ్చే నెలలో రాహుల్‌ పంజాబ్‌లో యాత్ర చేయనున్నారు.

సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో భారత్‌ జోడో యాత్ర ప్రారంభమైంది. తమిళనాడుతోపాటు కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో పాదయాత్ర పూర్తైంది. ప్రస్తుతం రాజస్థాన్‌లో కొనసాగుతోంది. వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి కశ్మీర్‌ చేరుకోనుంది.


Tags

Related News

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Udhayanidhi: డిప్యూటీ సీఎంగా మరో స్టార్ హీరో.. నేడే ప్రమాణస్వీకారం

Maihar Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా తొమ్మిది మంది స్పాట్ డెడ్!

Rain Effect: నేపాల్ లో వరదలు.. విరిగిపడ్డ కొండచరియలు.. ఇప్పటికే 66కి చేరిన మృతుల సంఖ్య

Jammu and Kashmi: జమ్మూకశ్మీర్‌లో మరోసారి కాల్పులు.. నలుగురు భద్రతా సిబ్బందికి గాయాలు

Book My Show black Tickets: చిక్కుల్లో ‘బుక్ మై షో’ సీఈవో.. బ్లాక్‌లో టికెట్లు అమ్మినందుకు సమన్లు

Special Trains: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు!

Big Stories

×