EPAPER

K Armstrong Murder: తమిళనాడు బిఎస్పీ నాయకుడి హత్య కేసు.. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో నిందితుడి మృతి..!

తమిళనాడులో సంచలనం రేపిన బిఎస్పీ నాయకుడు కె ఆర్మెస్ట్రాంగ్ హత్య కేసులో కీలక పరిణామం జరిగింది. పోలీసుల ఎన్ కౌంటర్‌లో శనివారం సాయంత్రం ఒక నిందితుడు చనిపోయాడు.

K Armstrong Murder: తమిళనాడు బిఎస్పీ నాయకుడి హత్య కేసు.. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో నిందితుడి మృతి..!

BSP Leader K Armstrong Murder Case Update: తమిళనాడులో సంచలనం రేపిన బిఎస్పీ నాయకుడు కె ఆర్మెస్ట్రాంగ్ హత్య కేసులో కీలక పరిణామం జరిగింది. పోలీసుల ఎన్ కౌంటర్‌లో శనివారం సాయంత్రం ఒక నిందితుడు చనిపోయాడు.


పోలీసుల కథనం ప్రకారం.. కేసు విచారణ కోసం హత్య జరిగిన ప్రాంతానికి నిందితుడు తిరువేంగదామ్‌ని పోలీసులు తీసుకువెళ్లారు. అక్కడ ఘటనా స్థలంలో నిందితులు హత్యకోసం ఉపయోగించిన ఆయుధాలు దాచిపెట్టారు. వాటిని వెలికి తీసే క్రమంలో నిందితుడు పోలీసులపై కాల్పులు చేశాడు.

పోలీసులు అతడిపై చేసిన ఎదురుకాల్పుల్లో నిందితునికి బుల్లెట్ గాయలాయ్యాయి. పోలీసులు నిందితుడు తిరువేంగదామ్‌ని వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. డాక్టర్లు అతను చనిపోయినట్లు నిర్ధారించారు.


ఇంతకుమందు తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన బిఎస్పీ నాయకుడు కె ఆర్మ్ స్ట్రాంగ్‌ని ఆరుగురు గుర్తుతెలియని వ్యక్తులు బైకులపై వచ్చి కత్తులతో నరికి చంపారు. హత్య జరిగిన సమయంలో ఆర్మ్ స్ట్రాంగ్.. చెన్నైలోని సెంబియం ప్రాంతంలో తన ఇంట్లో పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో ఉన్నారు. బైక్ పై వచ్చిన దుండగులు ఆయనపై ఒక్కసారిగా కత్తులతో దాడి చేశారు. ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా.. ఆయన మార్గం మధ్యలోనే ప్రాణాలు విడిచారు.

Also Read: నా భర్తపై గవర్నర్ కొడుకు దాడి చేశాడు.. ఒడిశా రాజ్ భవన్‌ సిబ్బంది భార్య

ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసులో ఆరుగురు నిందితులలో తిరువేంగదామ్‌ ఒకడు.

వృత్తి రీత్యా ఒక లాయర్ అయిన కెఆర్మ్ స్ట్రాంగ్ .. 2006లో చెన్నై కార్పోరేషన్ కౌన్సిల్ ఎన్నికల్లో విజయం సాధించాడు. రెండేళ్ల క్రితం ఆయన ఒక భారీ ఎన్నికల ర్యాలీ నిర్వహించి బిఎస్పీ అధినేత్రి మాయావతిని ఆహ్వానించాడు. అప్పటి నుంచి ఆయన తమిళ మీడియాలో దళితుల నాయకుడిగా పాపులర్ అయ్యాడు.

ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసుని సిబిఐ విచారణ చేయాలని మాయావతి డిమాండ్ చేశారు. తమిళనాడు ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ హత్య కేసుని సీరియస్ విచారణ చేయించడం లేదని ఆమె ఆరోపణలు చేస్తూ.. సిబిఐ ఈ కేసు విచారణ చేపట్టాలని కోరారు.

Tags

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుస రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×