Tirumala Laddu Controversy: కలియుగ దైవం కొలువై ఉన్న తిరుమలలో.. భక్తులు స్వామివారి దర్శనానంతరం అత్యంత పవిత్రంగా భావించి.. ప్రసాదంగా తీసుకునే లడ్డూ తయారీపై రెండ్రోజులుగా విమర్శలొస్తున్నాయి. గడిచిన ఐదేళ్లలో లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో నాణ్యత లేదని, జంతువుల కొవ్వుతో చేసిన నూనె కలిపారని వచ్చిన వార్తలు దేశవ్యాప్తంగా తీవ్రకలకలం రేపాయి. ఈ ఘటనపై ప్రముఖ జర్నలిస్ట్ సురేష్ చౌహాన్కే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సీజేఐకు ఆయన రాసిన లేఖలో తిరుమల లడ్డూ వివాదంపై ప్రస్తావించారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. మత విశ్వాసాలను దెబ్బతీసేలా తిరుమల లడ్డూ తయారు చేశారని ఆయన లేఖలో ప్రస్తావించారు. కొందరు ప్రభుత్వ అధికారుల అవినీతి కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన వాపోయారు. ఆలయాల పవిత్రత, మత విశ్వాసాలు, సంప్రదాయాలపై అవగాహన ఉన్నవారికే ఆలయ నిర్వహణ ఇవ్వాలని లేఖలో సీజేఐని కోరారు చౌహాన్కే.
Also Read: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు
మరోవైపు ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతిరోజూ వేలు, లక్షల సంఖ్యలో స్వామివారిని దర్శించుకునే భక్తులు.. శ్రీవారి లడ్డూని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. అలాంటి లడ్డూ తయారీలో జంతు కొవ్వులు కలిపిన నెయ్యిని వాడారన్న రిపోర్టు బహిర్గతమవ్వడంతో విస్తుపోతున్నారు. కేంద్రమంత్రులు సైతం ఈ ఘటనపై సీరియస్ గా స్పందించారు. లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో ఫిష్ ఆయిల్, గొడ్డు, పందికొవ్వు నుంచి తీసిన నూనెలను కలపడం.. భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని అభిప్రాయపడ్డారు. శ్రీవారితో పెట్టుకున్నవారు సర్వనాశనమైపోతారని దుమ్మెత్తిపోస్తున్నారు.
कहीं आप भी तो जानवरों की चर्बी वाला घी तो नहीं खा रहे हैं?
क्या भगवान के सामने जलने वाला दीपक शुद्ध घी का है?
यह स्वदेशी घी लीजिए, जो हम स्वयं उपयोग करते हैं और पूरी विश्वास से आपको सुझाव दे रहे हैं। #TirupatiControversy
ऑनलाइन शॉपिंग लिंक। 👇🏼https://t.co/duEQ43pp39
— Dr. Suresh Chavhanke “Sudarshan News” (@SureshChavhanke) September 20, 2024