Jharkhand | భూ కుంభకోణం కేసేులో ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ని ప్రశ్నించడానికి ఈడీ(ENFORCEMENT DIRECTORATE) అధికారులు ఆయన అధికారిక నివాసం వద్దకు చేరుకున్నారు.
Jharkhand | భూ కుంభకోణం కేసేులో ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ని ప్రశ్నించడానికి ఈడీ(ENFORCEMENT DIRECTORATE) అధికారులు ఆయన అధికారిక నివాసం వద్దకు చేరుకున్నారు.
ఈడీ అధికారులు ముఖ్యమంత్రిని ప్రశ్నించనున్నారనే వార్తలు రాగానే సిఎం హౌస్ వద్ద ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ కారణంగా అక్కడ కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాట్లు చేయబడ్డాయి. ముఖ్యంగా ఝార్ఖండ్ ఈడీ ఆఫీస్, ముఖ్యమంత్రి నివాసం ఈ రెండు చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేశారు.
ఈ కేసులో ఇప్పటికే ముఖ్యమంత్రి సోరేన్ని విచారణ హాజరు కావాల్సిందిగా ఈడీ అధికారులు ఏడు సార్లు సమన్లు జారీ చేశారు. సిఎంని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారని తెలియగానే ఝార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ నాయకులు, గిరిజన నాయకులు నిరసన చేపట్టారు. రాంచీలో ఒక ర్యాలీ నిర్వహించారు. దీంతో గొడవలు జరగకుండా ఉండాలని పోలీసులు 1000 మంది సెక్యూరిటీ బలగాలను సిఎం ఇంటి వద్ద మోహరించారు. సిఎం నివాసంలో గది తలుపులు మూసేసి గోప్యంగా విచారణ జరుగుతోందని సమాచారం.
హేమంత్ సోరెన్పై భూ కుంభకోణం, మనీ లాండరింగ్ కేసులు
ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ఇండియన్ ఆర్మీ ఆధీనంలోని 4.55 ఎకరాల భూమిని చట్ట వ్యతిరేకంగా విక్రయం జరిగిందని ఆరోపణలపై ఈడీ విచారణ చేపట్టింది. ఈ కేసులో ఇప్పటికే రాంచీలోని బడగాయి అంచల్ ప్రాంత రెవెన్యూ అధికారి భాను ప్రతాప్ ప్రసాద్ని, 2011 బ్యాచ్ IAS ఆఫీసర్ ఛవీ రంజన్ని అరెస్టు చేశారు. ఈ కుంభుకోణంలో ముఖ్యమంత్రి సోరెన్ హస్తం ఉందని ఆరోపణలు ఉండడంతో ఈడీ ఆయనను విచారణ చేస్తోంది.
ఈ కేసులో ఈడీ అధికారులు ఏడు సార్లు సమన్లు జారీ చేయగా.. ఎనిమిదో సారి ముఖ్యమంత్రి సోరేన్ స్పందించారు. జనవరి 20న విచారణకు సమయం ఇచ్చారు. మనీ లాండరింగ్, భూకుంభకోణం కేసులో ఇప్పటివరకు ఈడీ అధికారులు 10 మందిని అరెస్టు చేశారు.
Jharkhand CM, Hemant Soren, ED Questioning, Land scam case, Money Laundering, JMM Party, Jharkhand Mukti Morcha,