EPAPER

Indore Road Accident: వరుస రోడ్డు ప్రమాదాలు.. ఇండోర్ లో 8 మంది.. ఒడిశాలో ఆరుగురు మృతి

Indore Road Accident: వరుస రోడ్డు ప్రమాదాలు.. ఇండోర్ లో 8 మంది.. ఒడిశాలో ఆరుగురు మృతి

Jeep Collided with Vehicle in Indore District: రెండు వాహనాలు పరస్పరం ఢీ కొని.. 8 మంది మృతి చెందిన దుర్ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరొకరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం అర్థరాత్రి ఇండోర్ జిల్లాలో ఈ ఘోర ప్రమాదం జరిగింది.


అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) రూపేష్ కుమార్ ద్వివేది తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఘటాబిల్లోడ్ సమీపంలో ఒక జీపు గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మరణించగా.. మరొకరు గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు. కాగా.. ప్రమాదం అనంతరం గుర్తుతెలియని వాహనం డ్రైవర్ పరారైనట్లు ద్వివేది వెల్లడించారు. ప్రమాదంలో మృతిచెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: 160 స్పీడులో కారు, వీడియో తీస్తుండగా దారుణం..నలుగురు మృతి


మరోవైపు.. ఒడిశాలోని కియోంజర్ జిల్లాలోని చంపువా ప్రాంతంలో బుధవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ప్రయాణికులతో వెళ్తున్న కారును రెండు ట్రక్కులు ఢీ కొట్టడంతో ఆరుగురు మృతి చెందారు. జాతీయ రహదారి 520పై జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురూ ఒకే కుటుంబానికి చెందిన వారని, మృతుల్లో ఒక మహిళ కూడా ఉందని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.

Tags

Related News

Minister Comments: బ్రేకింగ్ న్యూస్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి.. తన కూతురు – అల్లుడిని నదిలో తోసేయండంటూ..

Amit Shah: ఆ విషయంలో.. పాక్‌తో చర్చలు జరిపే ఆలోచనే లేదు: అమిత్ షా

No Doctors For Jails: 5600 మంది ఖైదీలకు ఒక డాక్టర్.. జైళ్లలో నేరస్తుల ఆరోగ్యంపై నిర్లక్ష్యమా?..

Uttar Pradesh Wolf Attacks: యూపీలో తోడేళ్ల విధ్వంసం.. 8 మంది మృతి.. మంత్రి వింత వాదన!

Kolkata Rape Case CBI: కోల్‌కతా రేప్ నిందితుడికి బెయిల్?.. సిబిఐ నిర్లక్ష్యం.. మండిపడిన మమతా పార్టీ!

Jammu and Kashmir Assembly Polls: జమ్మూకాశ్మీర్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

Mumbai times tower: ముంబై.. మంటల్లో టైమ్స్ టవర్, భారీగా నష్టం

Big Stories

×