EPAPER

Suicide in Kota : ‘అమ్మా నాన్నా.. క్షమించండి’.. కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య..

Suicide in Kota : రాజస్థాన్‌లోని కోటాలో జేఈఈ (JEE) మెయిన్స్‌కు సన్నద్ధమవుతున్నమరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తాను చదవలేకపోతున్నానంటూ తల్లిదండ్రులకు సూసైడ్‌ నోట్‌ రాసింది. పోటీ పరీక్షల శిక్షణకు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్‌ లోని కోటా (Kota) లో విద్యార్థుల ఆత్మహత్య (Suicide)లు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జేఈఈ (JEE) మెయిన్స్‌కు సన్నద్ధమవుతున్న 18 ఏళ్ల విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. తాను ఈ పోటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేనంటూ తల్లిదండ్రులకు సూసైడ్‌ నోట్‌ రాసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Suicide in Kota : ‘అమ్మా నాన్నా.. క్షమించండి’.. కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య..

Suicide in Kota : రాజస్థాన్‌ రాష్టం కోటాలో జేఈఈ (JEE) మెయిన్స్‌కు సన్నద్ధమవుతున్నమరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తాను చదవలేకపోతున్నానంటూ తల్లిదండ్రులకు సూసైడ్‌ నోట్‌ రాసింది. పోటీ పరీక్షల శిక్షణకు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్‌ లోని కోటా (Kota) లో విద్యార్థుల ఆత్మహత్య (Suicide)లు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జేఈఈ (JEE) మెయిన్స్‌కు సన్నద్ధమవుతున్న 18 ఏళ్ల విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. తాను ఈ పోటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేనంటూ తల్లిదండ్రులకు సూసైడ్‌ నోట్‌ రాసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..


కోటాకు చెందిన ఆ బాలిక 12వ తరగతి చదువుతోంది. స్థానికంగా ఓ కోచింగ్‌ సెంటర్‌లో జేఈఈకి శిక్షణ తీసుకుంటున్నారు. సోమవారం తన ఇంట్లో తల్లదండ్రులకు సూసైడ్ నోట్ రాసి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీన్ని గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. సూసైడ్ నోట్ ను పోలీసులు గుర్తించారు.

“అమ్మా, నాన్న నేను జేఈఈ చదవలేను. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను నేను ఓడిపోయాను నన్ను క్షమించండి’’ అని అందులో రాసినట్లు పోలీసులు తెలిపారు. జనవరి 31న పరీక్ష రాయాల్సి ఉండగా.. మానసిక ఒత్తిడి కారణంగా ఆమె బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని పోలీసులు వెల్లడించారు.


కోటాలో ఈ ఏడాది చోటుచేసుకున్న రెండో ఘటన ఇది. జనవరి 23న ఒక ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్‌లో నీట్‌కు శిక్షణ తీసుకుంటున్న ఓ విద్యార్థి తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గత సంవత్సరం కూడా ఇక్కడ విద్యార్థులు వరుస ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే. 2023లో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.

దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవడంతో కేంద్రం పలు మార్గదర్శకాలను జారీ చేసింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా శిక్షణ ఇవ్వాలని సూచించింది. అటు విద్యార్థుల మరణాలను నియంత్రించేందుకు భవనాల చుట్టూ ఇనుప వలలు, గదుల లోపల స్ప్రింగ్‌ ఫ్యాన్లను అమర్చారు. అయినప్పటికీ ఇవి ఆగకపోవడం కలవరపెడుతోంది.

Tags

Related News

Deadbody In Suitcase: సూట్‌కేసులో యువతి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి.. దారుణ హత్య

Chennai’s IT Corridor: ఐటీ కారిడార్, సూట్ కేసులో మహిళ మృతదేహం.. ఏం జరిగింది?

Cambodia Cyber Slaves Agent: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్

Woman Cop Kidnap: మహిళా పోలీస్ కిడ్నాప్.. 112 డయల్ చేసి ఎలా తప్పించుకుందంటే?.

Fatal Extramarital Affair: భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో రొమాన్స్ షురూ.. ఆ తరువాత ఎంత హింస జరిగిందంటే..

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Lover Knife Attack: పెళ్లికి నిరాకరణ.. ప్రియురాలిపై ప్రియుడు కత్తితో.. ఆపై ఇద్దరూ

Big Stories

×