EPAPER
Kirrak Couples Episode 1

BBC: బీబీసీ ఆఫీస్‌పై ఐటీ దాడులు.. ఉద్యోగుల ఫోన్లు సీజ్

BBC: బీబీసీ ఆఫీస్‌పై ఐటీ దాడులు.. ఉద్యోగుల ఫోన్లు సీజ్

BBC: అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ కార్యాలయంపై ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు చేశారు. దాదాపు 60 నుంచి 70 మంది అధికారులు ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో ఉదయం నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. బీబీసీ ఉద్యోగుల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని వారిని ఇంటికి పంపించినట్లు తెలుస్తోంది. ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.


కాగా, ఇటీవల ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. 2002లో గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్న సమయంలో చోటుచేసుకున్న అల్లర్లపై బీబీసీ ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ పేరుతో డాక్యుమెంటరీని రూపొందించింది. అయితే భారత ప్రభుత్వం ఆ డాక్యుమెంటరీని తీవ్రంగా ఖండించింది.

ఈ వ్యవహారంపై హిందూ సేన అధ్యక్షుడు విష్ణుగుప్తా అత్యున్నత న్యాయం స్థానం సుప్రీంకోర్టులో పిటీషన్ కూడా దాఖలు చేశారు. ఈ డాక్యుమెంటరీ నేపథ్యంలో బీబీసీని దేశంలో నిషేధించాలంటూ కోర్టును కోరారు. అయితే సుప్రీం ఆ పిటీషన్‌ను తిరస్కరించింది. ఇదిలా ఉండగా బీబీసీ కార్యాలయంపై ఐటీ దాడులు జరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.


ఇక బీబీసీ కార్యాలయంపై ఐటీ సోదాలు చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ స్పందించారు. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని తాము డిమాండ్ చేస్తుంటే కేంద్రం మాత్రం బీబీసీ వెనకాల పడుతోందని విమర్శించారు. ఈమేరకు ట్విట్టర్‌లో ఓ వీడియో రిలీజ్ చేశారు.

Related News

Rajnath Singh Kashmir: ‘పాకిస్తాన్ కు ప్రపంచ బ్యాంకు కంటే ఎక్కువ అప్పు భారత్ ఇవ్వగలదు’.. కశ్మీర్‌లో రాజ్ నాథ్ సింగ్

Mallikarjun Kharge : జమ్మూ ర్యాలీలో ఖర్గేకు అస్వస్థత… మోదీని గద్దె దించేవరకు ప్రాణం పోదన్న కాంగ్రెస్ చీఫ్

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Udhayanidhi: డిప్యూటీ సీఎంగా మరో స్టార్ హీరో.. నేడే ప్రమాణస్వీకారం

Maihar Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా తొమ్మిది మంది స్పాట్ డెడ్!

Rain Effect: నేపాల్ లో వరదలు.. విరిగిపడ్డ కొండచరియలు.. ఇప్పటికే 66కి చేరిన మృతుల సంఖ్య

Jammu and Kashmi: జమ్మూకశ్మీర్‌లో మరోసారి కాల్పులు.. నలుగురు భద్రతా సిబ్బందికి గాయాలు

Big Stories

×