NCP news today(Latest breaking news in telugu): మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం. NCP అధినేత శరద్ పవార్తో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మళ్లీ భేటీ అయ్యారు. బాబాయిని అబ్బాయి కలవడం 24 గంటల్లో ఇది రెండోసారి.
ముంబయిలోని శరద్ పవార్ కార్యాలయానికి అజిత్ వర్గం నాయకులు ముందుగా చేరుకున్నారు. తర్వాత శరద్ పవార్ వచ్చారు. బెంగళూరులో విపక్షాల ఐక్య సమావేశానికి శరద్ పవార్ వెళ్లాల్సి ఉన్నా.. అజిత్తో సమావేశం కారణంగా వెళ్లలేదు. అంత ప్రయార్టీ ఇచ్చారాయన.
ఎన్సీపీని ఐక్యంగా ఉంచే విషయంపై ఇద్దరూ చర్చలు జరిపినట్టు చెప్తున్నారు. తమ విన్నపాన్ని విన్న శరద్ పవార్ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదని ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ తెలిపారు.
మహారాష్ట్రలో ఎన్సీపీని చీల్చి బీజేపీ కూటమిలో చేరారు అజిత్ పవార్. షిండే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా చేరారు. పార్టీ మాదంటే మాదంటూ రెండు వర్గాలు కీచులాడుకుంటున్న వేళ.. ఆదివారం శరద్ పవార్తో అజిత్ పవార్ సమావేశమయ్యారు. అప్పుడు కూడా పార్టీని ఐక్యంగా ఉంచాలన్న ప్రతిపాదనపైనే చర్చలు జరిగాయి. శరద్ పవార్ మాత్రం మౌనంగా విన్నారని, ఎలాంటి స్పందనా లేదని తెలిపారు.