IndiGo : విమానంలో ఓ ప్రయాణికుడు దురుసుగా ప్రవర్తించాడు. ఫ్లైట్ ఆలస్యంగా బయల్దేరుతుందని ప్రకటించిన పైలట్పై దాడికి పాల్పడ్డాడు. ఇండిగో విమానంలో జరిగిన ఈ ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
IndiGo : విమానంలో ఓ ప్రయాణికుడు దురుసుగా ప్రవర్తించాడు. ఫ్లైట్ ఆలస్యంగా బయల్దేరుతుందని ప్రకటించిన పైలట్పై దాడికి పాల్పడ్డాడు. ఇండిగో విమానంలో జరిగిన ఈ ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
డిల్లీ నుంచి గోవా వెళ్లాల్సిన ఇండిగో విమానానికి పొగమంచు కారణంగా అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణం ఆలస్యం అవుతుందని పైలట్ ప్రకటించాడు. ఇది విన్న వెంటనే ఓ ప్రయాణికుడు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. చివర వరుసలో కూర్చున్న అతడు పైలట్ వద్దకు దూసుకువచ్చి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఇండిగో ఫిర్యాదు చేసింది. అతడిని విమానం నుంచి దించేశారు. భద్రతా సిబ్బందికి అప్పగించింది. ఈ విమానం 13 గంటల ఆలస్యమైంది. విమానం ఆలస్యానికి అందులోని సిబ్బంది ఏం చేస్తారు..? అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ ప్రయాణికుడిని అరెస్టు చేసి, నో ఫ్లై లిస్ట్లో చేర్చండి అంటూ డిమాండ్ చేశారు.
ఉత్తర భారతాన్ని పొగమంచు కమ్మేసింది. అతి సమీపంలోని వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. దాంతో భారీ సంఖ్యలో విమానాలు ఆలస్యమవుతున్నాయి. సోమవారం సైతం పొగమంచు కారణంగా వందకు పైగా విమానాలు ఆలస్యం అయ్యాయి. 79 రద్దయ్యాయి. కాగా ఒక్కో విమానం కనీసం 50 నిమిషాల మేర ఆలస్యంగా నడుస్తోంది. ఈ పరిస్థితులతో ప్రయాణికులు అసహనానికి గురవుతున్నారు.