The Economy grew 78 % in the March: దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కీలకమైన జీడీపీ గణాంకాలు విడుదలయ్యాయి. 2023-24 మార్చితో ముగిసిన మూడో త్రైమాసికంలో అంచనాలు మించి 7.8 శాతంగా జీడీపీ వృద్ధి నమోదు అయ్యింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి వృద్ధి 8.2 శాతంగా నమోదు అయ్యింది. ఇందుకు సంబంధించి కేంద్ర గణాంక కార్యాలయం వివరాలను వెల్లడించింది.
డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికం 8.6 శాతంతో పోలిస్తే ఇది కాస్త తక్కువే. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జనవరి-మార్చి త్రైమాసికంలో దేశ జీడీపీ 6.02 శాతంగా నమోదు అయ్యింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి జీడీపీ 7 శాతం వృద్ధి చెందింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రెండోసారి ఎన్ఎస్ఓ వెలువరించిన అంచనాల్లో 7.7 శాతం వృద్ధి నమోదు కావచ్చని కేంద్ర గణాంక కార్యాలయం పేర్కొంది.
అయితే, అంతకుమించి జీడీపీ వృద్ధి నమోదు కావడం గమనార్హం. ఈ సంవత్సరం తొలి మూడు నెలల్లో పొరుగు దేశమైన చైనా 5.3 శాతం వృద్ధి రేటును నమోదు చేసిన విషయం తెలిసిందే. దేశానికి సంబంధించిన సంవత్సర ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంటే దాన్ని ద్రవ్యలోటు అంటారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 5.63గా నమోదు అయ్యింది. అయితే, వాస్తవానికి బడ్జెట్ లో 5.8 శాతంగా నమోదు కావచ్చని అంచనా వేశారు.
Also Read: సాఫ్టుగా ఉంటే అంతే! ఐటీ ఉద్యోగ కష్టాలు
వాస్తవ రూపంలో చూసినప్పుడు మాత్రం ఆదాయం, వ్యయం మధ్య వ్యత్యాసం రూ. 16.53 లక్షల కోట్లు అని అధికార గణాంకాలు చెబుతున్నాయి. కాగా, స్థూలంగా పన్నుల రూపంలో రూ. 23.26 లక్షల కోట్లు ప్రభుత్వానికి రాగా, వ్యయం రూ. 44.42 లక్షల కోట్లుగా ఉంది.