Indian Railways : భారతీయ రైల్వే సరుగు రవాణా ద్వారా మంచి లాభాలను రాబట్టుకుంటోంది. గతేడాదితో పోలిస్తే 16 శాతం ఎక్కువ లాభాలను సొంతం చేసుకుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు రూ.1,05,905 కోట్లను రైల్వే ఆర్జించింది. గతేడాది రూ.91,127 కోట్లను సాధించింది. సరుకులో కూడా భారీ పెరుగుదల కనిపించింది. ఈ ఏడాది 2022-2023లో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 978.72 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేస్తే.. గతేడాది..903.16 సరుకు రవాణా జరిగింది.
రైల్వేలో ప్రవేశపెట్టిన ‘హంగ్రీ ఫర్ కార్గో’ మంచి ఫలితాలను సాధిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కరోనా సమయంలో 2020 ఏప్రిల్ రికార్డ్ స్థాయిలో.. సరుకు రవాణాలో మరింత వృద్ధి సాధించడానికి భారతీయ రైల్వే సన్నద్ధమవుతోంది. 2023-2024లో 2వేల మెట్రిక్ టన్నుల సరుకు రవాణానే లక్ష్యంగా ఇండియన్ రైల్వే ముందుకు సాగుతోంది.