EPAPER
Kirrak Couples Episode 1

MiG-29 fighter jets : చైనా, పాక్ కు చెక్ పెట్టే వ్యూహం.. ఎలాగంటే..?

MiG-29 fighter jets : చైనా, పాక్ కు చెక్ పెట్టే వ్యూహం.. ఎలాగంటే..?
MiG-29 fighter jets latest news


MiG-29 fighter jets latest news(India today news): పాకిస్థాన్‌, చైనాలకు చెక్‌ పెట్టేలా వ్యూహాలకు పదును పెట్టింది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్. శ్రీనగర్‌లోని ఎయిర్‌బేస్‌ను అప్‌గ్రేడ్ చేసింది. ఇప్పటి వరకు ఉన్న మిగ్‌-21 స్క్వాడ్రన్ల స్థానంలో మిగ్‌-29 స్క్వాడ్రన్లను మోహరించింది. డిఫెండర్ ఆఫ్ ది నార్త్‌గా గుర్తింపు పొందిన ట్రైడెంట్స్ స్క్వాడ్రన్.. పాకిస్థాన్, చైనా నుంచి వచ్చే ప్రమాదాలను నివారించేందుకు మోహరించింది IAF.

కశ్మీర్‌ లోయ మధ్యలో శ్రీనగర్‌ ఉంటుంది. మైదానాల కంటే ఎత్తులో ఉంటుంది. అందుకే సరిహద్దులకు సమీపంలో ఉండే ఎయిర్‌బేస్‌ల్లో వేగంగా స్పందించే యుద్ధ విమానాలను మోహరించడం ఉత్తమమని IAF భావిస్తోంది. ఈ ఫైటర్‌ జెట్స్‌ లాంగ్‌ రేంజ్ మిస్సైళ్లను ప్రయోగించేవైతే.. మరింత అడ్వాంటేజ్‌ ఉంటుంది. ఈ సామర్థ్యాలన్ని మిగ్‌-29కు ఉన్నాయని IAF చెబుతోంది. రెండు దేశాలు దాడి చేసిన ఈ స్క్వాడ్రన్‌కు ఎదుర్కోనే శక్తి ఉంటుందని ప్రకటించింది.


కశ్మీర్ లోయను చాలా ఏళ్ల నుంచి రక్షిస్తున్న మిగ్-21 కంటే మిగ్‌- 29లో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. 2019లో బాలాకోట్ ఎయిర్‌ స్ట్రైక్స్‌లో ఉగ్రవాద శిబిరాలపై దాడి, పాక్ F-16లను కూల్చివేతలో కీలకంగా వ్యవహరించాయి. అప్‌గ్రేడ్ చేసిన మిగ్‌ 29 నుంచి ఎయిర్‌ టు ఎయిర్‌.. ఎయిర్‌ టు గ్రౌండ్‌ ప్రయోగించే లాంగ్‌ రేంజ్ మిస్సైల్స్‌, ఆయుధాలు, అత్యవసర సమయంలో సాయుధ దళాల ఉపయోగానికి ప్రభుత్వం అందజేసిన శక్తివంతమైన ఆయుధాలు కూడా ఉన్నాయి.

అంతేకాదు నైట్ విజన్ మోడ్.. ఎయిర్‌ రిఫీల్లింగ్‌ కూడా మిగ్‌-29లకు ఉందని IAF అధికారులు చెబుతున్నారు. సరిహద్దుల్లో ఏదైనా ప్రతిష్టంభన ఏర్పడితే వెంటనే వీటిని రంగంలోకి దించవచ్చంటున్నారు. మిగ్‌-29లను జనవరిలోనే శ్రీనగర్‌ ఎయిర్‌బేస్‌కి తరలించగా.. లడఖ్ సెక్టార్‌తో పాటు కశ్మీర్ లోయలో విస్తృతంగా ప్రయాణించాయి. ఒకవేళ చైనా గగనతల ఉల్లంఘనకు ప్రయత్నిస్తే మొదట రియాక్టయ్యే వాటిలో ఈ ఫైటర్ జెట్సే ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

Related News

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

RTC Electric Buses: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న 35 ఎలక్ట్రిక్ బస్సులు

Big Stories

×