India China Border : అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో భారత్, చైనా సైనికుల నడుమ ఈనెల 9న ఘర్షణ తెలెత్తి మరోమారు సరిహద్దు వివాదంరాజుకుంది. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. అరుణాచల్ ప్రదేశ్లోని చైనా సరిహద్దుల్లో యుద్ధ విమానాలతో గస్తీ నిర్వహిస్తున్నది. సరిహద్దు ప్రాంతంలో చైనా గగనతల విహారం పెరిగినట్లు గుర్తించిన క్రమంలో ఈ మేరకు భారత్ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. చైనా బలగాలను తిప్పికొట్టేందుకు ఇటీవల రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగా ఫైటర్ జెట్స్ గస్తీ పెంచినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.
ఇటీవల కాలంలో చైనా సైన్యం భారీ సంఖ్యలో దళాలను పెట్రోలింగ్కు పంపుతోంది. పెట్రోలింగ్ చేసే ప్రదేశాలు చైనావే అని వెల్లడించేందుకు ఇలా చేస్తోంది. గత కొన్నేళ్లలో చైనా చొరబాట్లు ఎల్ఏసీ పశ్చిమ సెక్టార్లోనే ఎక్కువగా చోటు చేసుకొన్నాయి. కానీ, మధ్య, తూర్పు సెక్టార్లలో కూడా ఇటీవల కాలంలో మెల్లగా పెంచుతోంది.
తవాంగ్ సెక్టార్లో ఎల్ఏసీ వద్ద యాంగ్త్సే సమీపంలో భారత్, చైనా సైనికల నడుమ ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నెల9న జరిగిన ఈ సంఘటన వివరాలను భారత సైన్యం సోమవారం బహిర్గతం చేసింది.