India Australia Militiary Exercises : భారత్, ఆస్ట్రేలియా దేశాలు కలిసి సంయుక్తంగా మిలిటరీ ఆపరేషన్ ను నిర్వహిస్తున్నాయి. ఆస్ట్రాహింద్- 2022పేరుతో భారత్ లోని రాజస్థాన్లో సైనిక విన్యాసాలు చేపట్టాయి. ఇవాళ్టి నుంచి డిసెంబర్ 11 వరకు మిలటరీ జాయింట్ ఆపరేషన్ జరగనుంది.
యూఎన్ ఆదేశాల నియమ నిబంధనలకు అనుగూణంగా శాంతి స్థాపన కోసం ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నట్టు భారత్, ఆస్ట్రేలియా దేశాలు పేర్కొన్నాయి. ఈ మిలటరీ ఆపరేషన్ లో రెండు దేశాలకు చెందిన భద్రతా దళాలు పలు విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ప్రత్యర్థులు దేశంపై దాడి చేస్తే సైన్యం ఎలా ప్రతిఘటించాలని అని మాక్ డ్రిల్ చేస్తున్నాయి.