Early Monsoon with More Rain to India Says IMD: భారత వాతావరణ శాఖ దేశ ప్రజలకు చల్లని కబురు చెప్పింది. రాబోయే వర్షాకాలంలో దేశవ్యాప్తంగా సంవృద్ధిగా వర్షాలు కరుస్తాయని ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం నెలకొన్న ఎల్ నినో పరిస్థితులు పూర్తిగా తొలగిపోయి.. లా నినా పరిస్థితులు కారణంగా రుతుపవనాలు ముందుగానే వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో కర్ణాకట రాష్ట్రంలో మంచినీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నారు. దేశంలోని మరికొన్ని నగరాల్లో కూడా నీటి ఎద్దడి నెలకొంది. ఈ తరుణంలో రాబోయే వర్షా కాలంలో వర్షాలు కురుస్తాయా..? లేదా..? అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ భారత వాతావరణ శాఖ కీలక విషయాన్ని వెల్లడించింది.
జూన్-ఆగస్టు నాటికి లా నినా పరిస్థితులు ఏర్పడితే గతేడాది కంటే ముందుగానే రుతుపవనాలు వస్తాయని.. దీంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు కురిసే విధంగా బలమైన రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
హిందూ మహాసముద్రంలో ద్విధ్రువ పరిస్థితులతో పాటుగా లా నినా పరిస్థితులు ఏకకాలంలో యాక్టివ్ అవ్వడంతో రుతుపవనాలు ముందుగానే వస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రుతుపవనాలు అల్పపీడనాలు పశ్చిమ, వాయువ్య భారతదేశం, ఉత్తర అరేబియా సముద్రం మీదుగా విస్తరించి ఉంటాయని తెలిపింది.
Also Read: మూడో విడత ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ..
దీంతో సముద్రమట్టాలు కూడా పెరుగుతాయని వెల్లడించింది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో వర్షపాతం పెరుగుతుందని.. దీంతో దేశంలో సాధారణ వర్షానికి మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.