EPAPER

Tractor Horrific road accident: రాజ్‌గఢ్‌లో ట్రాక్టర్ బోల్తా, 13 మంది మ‌ృతి.. పెళ్లికి వచ్చి…

Tractor Horrific road accident: రాజ్‌గఢ్‌లో ట్రాక్టర్ బోల్తా,  13 మంది మ‌ృతి.. పెళ్లికి వచ్చి…

Tractor Horrific road accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో 13 మంది మృతి చెందగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడిన బాధితులను సమీపంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.


బోపాల్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పెళ్లి నిమిత్తం రాజస్థాన్ నుంచి 30 మంది మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌కు వస్తున్నారు. ఆదివారం అర్థరాత్రి దాటాక పిఫ్లోధిజాద్‌ సమీపంలోకి రాగానే పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడింది.

అయితే ట్రాక్టర్‌లో ఎక్కువ మంది ఎక్కడంవల్లే ఈ ఘటన జరిగిందని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే కలెక్టర్ హర్షదీక్షిత్ వెంటనే అధికారులతో మాట్లాడారు. క్షతగ్రాతులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధితులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అందులో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.


ALSO READ: సిక్కింలో రెండోసారి అధికారంలోకి SKM.. గురువును మళ్లీ ఓడించిన శిష్యుడు

ఈ ఘటనపై రాష్ట్రపతి ముర్ము తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

 

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×