Indian navy latest news today(Current news from India) : భారత నౌకాదళం అమ్ములపొదిలోకి మరో కొత్త అస్త్రం చేరనుంది. స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన భారీ టార్పిడోను నేవీ విజయవంతంగా పరీక్షించింది. నీటిలోపల లక్ష్యాన్ని ఈ టార్పిడో ఛేదించింది. ఈ ప్రయోగ వీడియోను నేవీ ట్విటర్లో పోస్ట్ చేసింది.
నీటి అడుగున ఉండే లక్ష్యాలను కచ్చితంగా ఛేదించగల ఆయుధాల తయారీ కోసం నేవీ, డీఆర్డీవో ఎంతో కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో భారీ టార్పిడోను అభివృద్ధి చేశాయి. ఈ హెవీ వెయిట్ టార్పిడోతో నీటిలోని లక్ష్యాన్ని ధ్వంసం చేశామని నేవీ ప్రకటించింది.ఆత్మనిర్భరతకు ఇది నిదర్శనంగా పేర్కొంది. కానీ ఈ టార్పిడో పేరు, ఫీచర్లను నౌకాదళం ఇంకా వెల్లడించలేదు. హిందూ మహా సముద్రంలో చైనా చర్యలతో ముప్పు పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే నేవీ ఈ ప్రయోగం చేపట్టడం విశేషం.
ఇప్పటికే భారత నౌకాదళంలో వరుణాస్త్ర అనే భారీ టార్పిడో ఉంది. నీటి అడుగు నుంచి క్షిపణిని ప్రయోగిస్తారు. 30 కిలోమీటర్ల దూరంలో ఉండే లక్ష్యాలను ఛేదించేందుకు జలాంతర్గామి నుంచి శత్రునౌకల పైకి ఈ టార్పిడోను ప్రయోగిస్తారు. విశాఖపట్నంలోని నావల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ ల్యాబొరేటరీ ఈ టార్పిడోను అభివృద్ధి చేసింది.