EPAPER

Half Day Office : ఒంటిపూటే ఆఫీసులు.. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..

Half Day Office : ఒంటిపూటే ఆఫీసులు.. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..

Half Day Office : ఒకపూటే విధులు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు ఈ బంఫర్ ఆఫర్ ఇచ్చింది. ప్రస్తుతం అక్కడ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. మే 2 నుంచి ఉదయం 7.30 గంటలకు డ్యూటీకి రావాలి. మధ్యాహ్నం 2 గంటలకు విధులు ముగిసిపోతాయి. జూలై 15 వరకు కొత్త పనివేళలు అమలవుతాయి. వేసవిలో ఇలా ఉద్యోగులకు తీపికబురు చెప్పింది పంజాబ్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ వీడియో సందేశం ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు నిపుణులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.


సాధారణంగా వేసవిలో పిల్లలకు ఎండల నుంచి ఉపశమనం కల్పించేందుకు ఒంటిపూట బడులు నిర్వహిస్తుంటారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇలాంటి అవకాశం కల్పించింది పంజాబ్ ప్రభుత్వం . ఆఫీసుల పనివేళలను మార్చడంతో విద్యుత్‌ లోడ్‌ కూడా తగ్గుతుందని సీఎం చెప్పారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత విద్యుత్‌పై లోడ్‌ అధికంగా ఉంటుందని విద్యుత్‌శాఖ అధికారులు తెలిపారని.. ఇప్పుడు ఆఫీసులను 2 గంటలకు మూసివేయడంతో ఆ లోడ్‌ 300-350 మెగావాట్లు తగ్గుతుందన్నారు. తాను కూడా ఉదయం 7.30 గంటలకే ఆఫీసుకు వస్తానని ప్రకటించారు.

కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ ఏడాది వేసవిలో అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఇప్పటికే భారత వాతావరణశాఖ ప్రకటించింది. బిహార్‌, ఝార్ఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో ఏప్రిల్‌- జూన్‌ మధ్య ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని హెచ్చరించింది. వేడిగాలులు వీస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో పంజాబ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగులు ఖుషీ అవుతున్నారు. సమ్మర్ హాలీడేస్ ఇంట్లో ఉండే పిల్లలతో ఎక్కువసేపు గడిపే అవకాశం దొరుకుతుందని సంతోష పడుతున్నారు.


Related News

Jammu Kashmir Elections: జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

MLA Bojju Patel: రవ్‌నీత్ సింగ్ తలను తీసుకొస్తే.. నా ఆస్తి రాసిస్తా : కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలనం

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Big Stories

×