గోవా (Goa)లోని పనాజీలో ఊహించని సంఘటన వెలుగుచూసింది. ఓ కుటుంబం తమ వ్యక్తే చనిపోయాడని భావించి మూడు నెలల క్రితం అంత్యక్రియలు నిర్వహించారు. 3 నెలల తర్వాత మళ్లీ అతను ప్రత్యక్షం కావడం కుటుంబ సభ్యులకు షాక్కు గురిచేసింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. గోవా రాజధాని పనాజీ సమీపంలోని గ్రామంలో నివసించే మార్కోస్ మిలాగ్రేస్ (59) 2023లో ఆదృశ్యం అయ్యాడు.
దీంతో కుటుంబ సభ్యులు అదే సంవత్సరం అక్టోబరులో పోలీసులను ఆశ్రయించారు. అక్టోబర్ 7న పనాజీలో పోలీసులకు ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. అది మిలాగ్రేస్దేనని కుటుంబ సభ్యులు నిర్ధారించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్మార్టం అనంతరం పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.
ఇది జరిగిన రెండు నెలల తర్వాత గోవా పోలీసులకు ముంబై నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఓ వ్యక్తి తనను తాను మిలాగ్రేస్గా చెప్పుకొంటున్నట్లు సమాచారం ఇచ్చారు. దీంతో అతన్ని గోవా తీసుకొచ్చి కుటుంబ సభ్యులను పిలిపించారు. వారు మిలాగ్రేస్ను చూసి షాక్ అయ్యారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ఆయన ముంబయి వెళ్లినట్లు పోలీస్ విచారణలో తెలింది. అయితే.. మిలాగ్రెస్ కుటుంబానికి అప్పగించిన మృతదేహాం ఎవరిదనేది తేలాల్సి ఉంది.