Car: స్నేహితుడితో బయటకు వెళ్లడమే ఆమె చేసిన పాపం. నలుగురు కామాంధుల చేతిలో బలికావాల్సి వచ్చింది. కారులో చిత్రహింసలకు గురికావాల్సి వచ్చింది. నరకం అనుభవించాల్సి వచ్చింది. కర్ణాటకలో జరిగింది ఈ దారుణమైన ఘటన.
బెంగళూరుకు చెందిన 19 ఏళ్ల యువతి స్నేహితుడితో కలిసి పార్క్కు వెళ్లింది. సమయం రాత్రి 9.30 గంటలు కావడంతో అంతా చీకటిగా ఉంది. చుట్టూ ఒక్క పురుగు కూడా లేదు. అదే సమయంలో నలుగురు కామాంధులు వారి వద్దకు వచ్చారు. మద్యం మత్తులో దుర్భాషలాడారు. యువతిపై ఇష్టం వచ్చినట్లుగా చేయి వేశారు. యువకుడు అడ్డుకోవడంతో అతడిని బెదిరిస్తూ చితకబాదారు. బలవంతంగా యువతిని కారులో ఎక్కించుకున్నారు.
కదులున్న కారులోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. దోమ్లూర్, ఇందిరానగర్, అనేకల్, నైస్రోడ్లో ప్రయాణిస్తూ కారులో యువతిని చిత్ర హింసలకు గురి చేశారు. మరునాడు తెల్లవారు జామున ఉదయం 4 గంటల సమయంలో యువతి ఇంటి దగ్గర్లో వదిలేశారు. పోలీసులకు చెబితే చంపేస్తామని హెచ్చరించారు.
అయితే యువతి ఇంటికి వెళ్లగానే జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వాళ్లు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. యువతి చెప్పిన వివరాల ఆధారంగా గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నారు.
నిందితులు విజయ్, శ్రీధర్, కిరణ్, సతీష్లుగా గుర్తించారు. వారంతా స్థానింగా ఉండే చిన్న కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేశామని త్వరలోనే కోర్టులో ప్రవేశ పెడుతామని వెల్లడించారు.