EPAPER

Wayanad Landslides: వయనాడ్ కొండ గుహలో చిక్కుకున్న గిరిజనులు.. తర్వాత ఏమైందంటే ?

Wayanad Landslides: వయనాడ్ కొండ గుహలో చిక్కుకున్న గిరిజనులు.. తర్వాత ఏమైందంటే ?

Wayanad Landslides: కేరళలోని వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో భారీగా ప్రాణ, ఆస్థి నష్టం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ విలయం నుంచి తప్పించుకునేందుకు కొందరు గిరిజనులు వయనాడ్ కొండపైకి ఎక్కారు. భారీ వర్షం కారణంగా గుహలో తలదాచుకున్న వారంతా అక్కడ చిక్కుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న కేరళ అటవీ శాఖ అధికారులు పెద్ద సాహసమే చేశారు. కల్పేట రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ కే హషీష్ నేతృత్వంలో నలుగురు సభ్యులు నాలుగున్నర గంటలపాటు నడిచి వారు ఉన్న కొండపైకి చేరుకున్నారు.


గిరిజనులు తల దాచుకున్న గుహకు ఎదురుగా ఉన్న లోయ వద్దకు.. గుహలో ఉన్న తన భర్త, పిల్లల  ఆహారం కోసం బయటకు వచ్చిన మహిళలను అధికారులు గుర్తించారు. అనంతరం ఏడాది నుంచి నాలుగేళ్ల వయస్సు ఉన్న నలుగురు పిల్లలు, భార్యా భర్తలతో కూడిన కుటుంబం గురించిన ఆచూకీని అధికారులకు చేరవేసారు. గుహలో చిక్కుకున్న వారు వయనాడ్‌లోని పానియా గిరిజన కమ్మునిటీకి చెందిన కుటుంబం అని ఫారెస్ట్ అధికారి హషీష్ వెల్లడించారు. అటవీ ప్రాంతంలో ప్రాణాలకు తెగించి గిరిజన కుటుంబాన్ని కాపాడిన అటవీ శాఖ అధికారులను సీఎం విజయన్ ప్రశంసించారు.ఈ రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×