EPAPER

5 Dead in Bus-Tractor Collision: ట్రాక్టర్‌ను ఢీకొని లోయలో పడ్డ బస్సు.. ఐదుగురు మృతి.. 42 మందికి గాయాలు

5 Dead in Bus-Tractor Collision: ట్రాక్టర్‌ను ఢీకొని లోయలో పడ్డ బస్సు.. ఐదుగురు మృతి.. 42 మందికి గాయాలు

5 Dead in Bus-Tractor Collision Near Mumbai Express Highway: ముంబై ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు మినీ బస్సు ఆగివున్న ట్రాక్టర్‌ను ఢీకొని ప్రమాదావశాత్తు లోయలో పడింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా 42 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ట్రావెల్ బస్సు ట్రాక్టర్‌ను ఢీకొనడంతో పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. దీంతో అక్కడిక్కడే ఐదుగురు మృతి చెందగా.. 42 మందికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాద సమయంలో దాదాపు 60 మంది ఉన్నట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. అందులో కొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం కారణంగా ముంబై ఎక్స్‌ప్రెస్ హైవేపై ముంబై-లోనావాలా లేన్‌లో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అధికారులు క్రేన్ సహాయంతో బస్సును వెలికి తీసారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధిచిన గల కారణాలు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వలన ఈ ఘటన జరిగినట్లు DCP నవీ తెలిపారు.


Also Read: అలాంటి తప్పులు చేసేవారికి..ఇకపై వెరైటీ శిక్షలు

Tags

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×