5 Dead in Bus-Tractor Collision Near Mumbai Express Highway: ముంబై ఎక్స్ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు మినీ బస్సు ఆగివున్న ట్రాక్టర్ను ఢీకొని ప్రమాదావశాత్తు లోయలో పడింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా 42 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ట్రావెల్ బస్సు ట్రాక్టర్ను ఢీకొనడంతో పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. దీంతో అక్కడిక్కడే ఐదుగురు మృతి చెందగా.. 42 మందికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాద సమయంలో దాదాపు 60 మంది ఉన్నట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. అందులో కొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం కారణంగా ముంబై ఎక్స్ప్రెస్ హైవేపై ముంబై-లోనావాలా లేన్లో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అధికారులు క్రేన్ సహాయంతో బస్సును వెలికి తీసారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధిచిన గల కారణాలు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వలన ఈ ఘటన జరిగినట్లు DCP నవీ తెలిపారు.
Also Read: అలాంటి తప్పులు చేసేవారికి..ఇకపై వెరైటీ శిక్షలు
#WATCH | Mumbai | Four people died and several others were injured after a bus collided with a tractor and fell into a ditch near the Mumbai Express Highway. All the injured were admitted to the nearby MGM Hospital: Pankaj Dahane, DCP Navi Mumbai Police
The bus with devotees… pic.twitter.com/4HY3vdPVEp
— ANI (@ANI) July 15, 2024