Transgender couple: దేశంలోనే మొట్టమొదటిసారి స్త్రీగా మారిన ఓ పురుషుడు బిడ్డకు జన్మనివ్వబోతున్నాడు. కేరళకు చెందిన ట్రాన్స్జెండర్స్ జంట జాహద్, జియాలు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని వారు ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు.
కేరళకు చెందిన ట్రాన్స్జెండర్లు జియా, జహద్ మూడేళ్లుగా కలిసి జీవనం సాగిస్తున్నారు. పురుషుడుగా జన్మించిన జియా లింగమార్పిడి చేయించుకొని స్త్రీగా మారారు. ఈక్రమంలో జియా గర్భం దాల్చారు. దీంతో జహద్ పురుషుడిగా మారే చికిత్సను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు.
ప్రస్తుతం కడుపులో బిడ్డ క్షేమంగా ఉందని… మార్చి నెలలో డెలివరి ఉండొచ్చని జియా ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చారు. తల్లి కావాలనుకునే తన కోరిక.. తండ్రి కావాలనుకునే జహాద్ కోరిక త్వరలోనే నెరవేరబోతోందని పేర్కొన్నారు. మొదట్లో అనాథలని దత్తత తీసుకొని పెంచుకుందామనుకున్నామని.. గర్భందాల్చిన తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకున్నామని జియా వెల్లడించారు. పుట్టబోయే బిడ్డకు మిల్క్ బ్యాంక్ నుంచి బ్రెస్ట్ మిల్క్ను పట్టించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.