First News Reader Shanti Swaroop: నేటి స్మార్ట్ యుగంలో.. ప్రపంచంలో ఏం జరిగినా అరక్షణంలో అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ ద్వారా తెలిసిపోతుంది. కానీ.. ఒకప్పుడు అంటే మన పూర్వీకుల కాలంలో.. రోజులో వచ్చే అరగంట వార్తల్లోనే ఎక్కడ ఏం జరుగుతుందన్న సమాచారం తెలిసేది. దూరదర్శన్ లో తొలి తెలుగు న్యూస్ రీడర్ గా పనిచేసిన శాంతి స్వరూప్ గుండెపోటుతో కన్నుమూశారు.
రెండ్రోజుల క్రితం ఆయనకు హార్ట్ అటాక్ రావడంతో.. హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారాయన. 1977 అక్టోబర్ 23న దూరదర్శన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి వాటిని ప్రారంభించగా.. తొలిసారిగా శాంతిస్వరూప్ తెలుగులో వార్తలు చదివారు. 1983 నవంబర్ 14 నుంచి ఆయన దూరదర్శన్ లో న్యూస్ రీడర్ గా పనిచేశారు. 2011లో ఆయన పదవీ విరమణ పొందారు. శాంతి స్వరూప్ మరణం పట్ల పలువురు సంతాపం తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. శాంతి స్వరూప్ మృతి పట్ల సంతాపం తెలిపారు.