Odisha: ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నబకిశోర్దాస్పై ఏఎస్ఐ కాల్పులు జరిపాడు. ఝార్సుగుద జిల్లాలోని బ్రజ్రాజ్నగర్ గాంధీ చౌక్ వద్ద మంత్రి కారు దిగగానే ఏఎస్ఐ గోపాల్ దాస్ తన తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో మంత్రి ఛాతిలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సిబ్బంది ఆయనను భువనేశ్వర్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ మంత్రి నబకిశోర్ దాస్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
దాడి విషయం తెలియగానే బీజేడీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వారిని అడ్డుకున్నారు. అయితే మంత్రిపై ఏఎస్ఐ గోపాల్ దాస్ ఎందుకు కాల్పులు జరిపాడనే విషయం తెలియాల్సి ఉంది.