EPAPER
Kirrak Couples Episode 1

Odisha: ఒడిశా మంత్రిపై కాల్పులు.. చికిత్స పొందుతూ మృతి..

Odisha: ఒడిశా మంత్రిపై కాల్పులు.. చికిత్స పొందుతూ మృతి..

Odisha: ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నబకిశోర్‌దాస్‌పై ఏఎస్ఐ కాల్పులు జరిపాడు. ఝార్‌సుగుద జిల్లాలోని బ్రజ్‌రాజ్‌నగర్ గాంధీ చౌక్ వద్ద మంత్రి కారు దిగగానే ఏఎస్ఐ గోపాల్ దాస్ తన తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో మంత్రి ఛాతిలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సిబ్బంది ఆయనను భువనేశ్వర్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ మంత్రి నబకిశోర్ దాస్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.


దాడి విషయం తెలియగానే బీజేడీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వారిని అడ్డుకున్నారు. అయితే మంత్రిపై ఏఎస్ఐ గోపాల్ దాస్ ఎందుకు కాల్పులు జరిపాడనే విషయం తెలియాల్సి ఉంది.


Related News

Hand Foot Mouth: రాష్ట్రంలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ కలకలం.. వ్యాధి లక్షణాలు ఇవే!

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

Big Stories

×