Fire breaks out in two restaurants: ఢిల్లీని వరస ఘటనలు వెంటాడుతున్నాయి. కోచింగ్ సెంటర్లో జరిగిన ప్రమాదాన్ని మరచిపోకముందే మరో ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలోని ఐఎన్ఏ మార్కెట్లో ఫాస్ట్ ఫుడ్, రెస్టారెంట్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది.
ఢిల్లీలోని ఐఎన్ఏ మార్కెట్లో చైనీస్కు చెందిన ఫాస్ట్ఫుడ్ షాపు ఉంది. సోమవారం తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో ఆ షాపు నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆ తర్వాత పక్కనే ఉన్న రెస్టారెంట్కు మంటలు వ్యాపించాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడంతో ఆ చుట్టుపక్కల వాసులు భయంతో పరుగులు తీశారు.
ఈ ఘటనలో ఫాస్ట్ఫుడ్ యజమాని సహా ఆరుగురు గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించాడు. పలువురు శరీరం కాలినట్టు తెలుస్తోంది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే దాదాపు 8 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
ALSO READ: అక్కే వ్యభిచార రొంపిలోకి దింపింది.. చెన్నైలో వెలుగుచూసిన ఘటన
అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. మరోవైపు రెస్టారెంట్లలో అవసరమైన దానికంటే ఎక్కువగా గ్యాస్ సిలిండర్లను స్టోరేజ్ చేయడమే ఈ ఘటన తీవ్రతకు కారణంగా తెలుస్తోంది. మరి పోలీసులు విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.
#WATCH | Delhi: Fire broke out at a fast food restaurant in INA market. 8 fire tenders at the spot. Parts of the roof of the restaurant have collapsed. 4 to 6 people have been injured: Delhi Fire service pic.twitter.com/glnFOXqg60
— ANI (@ANI) July 28, 2024